ఇద్దరి మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
News Posted: 24 February, 2010
|