రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఐదు రోజుల క్రితం కిడ్నాప్ నకు గురైన న్యాయవాది కల్యాణ్ హత్యకు గురయ్యారు. మారేడుమిల్లికీ 16 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో శుక్రవారం ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నలుగురు నిందితులను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.