పట్టపగలే చోరీ
ఏలూరు : హనుమాన్ జంక్షన్ లో పట్టపగలే చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి తుపాకీ గురి చూపి భార్యాభర్తలను బెదిరించారు. డబ్బు, బంగారం ఎక్కడ ఉందో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఇంట్లో ఎక్కడా డబ్బు దొరకలేదు. 40 కాసుల బంగారం, వెండి వస్తువులను, బ్యాంక్ ఏటీఎం కార్డులు, వాటి పాస్ వర్డ్ లను దోచుకున్నారు. దుండగులు పారిపోయిన తరువాత బాథితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
News Posted: 6 March, 2010
|