సోదరిని చంపిన ఉన్మాది
కడప ః కడప జిల్లా కాశినాయన మండల పరిధిలోని అమగంపల్లె ఆశ్రమంపై కర్నూలు జిల్లా చాగల మర్రి చిన్నవంగలికి చెందిన నరసింహులు బుధవారం తెల్లవారి జామున గొడ్డలితో దాడి చేసి అక్కడ పని చేస్తున్న సోదరి జి.అచ్చమ్మ (60)ను హతమార్చాడు. అచ్చమ్మ సోదరుడైన నరసింహులు తన కుమార్తె వివాహం నిమిత్తం తన స్వగ్రమామమైన కర్నూలు జిల్లా నుంచి ఆశ్రమం చేరాడు. ఆశ్రమంలో ప్రత్యేక గదిలో నిద్రిస్తున్న అచ్చమ్మ తమ్ముడు రాకతో తలుపులు తెరిచింది. పీకలదాకా తప్పతాగిన ఆ నరహింహులు తన కుమార్తె వివాహానికి డబ్బులు కావాలని ఆమెను అడగడం, ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తన వెంట తీసుకువెళ్ళిన గొడ్డలితో ఆమె తలపై మోదాడు. ఆమె అక్కడికక్కమే మరణించింది. అలజడి గమనించి ఆశ్రమ సమీపంలోనే ఉన్న అచ్చమ్మ బంధువు లక్ష్మీనర్సమ్మ పరుగున వచ్చి అడ్డు రావడంతో ఆమెపై కూడా నరసింహులు దాడిచేశాడు. దీంతో గ్రామస్తులు నరసింహులను తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు.
News Posted: 12 February, 2009
|