ప్రిన్సిపాల్ కు దేహశుద్ధి
రాజమండ్రి : ఉచితానుచితాలు నేర్పాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తించడంతో విద్యార్థులే దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పిన సంఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న థామస్ అనే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల చేతిలో చావు తన్నులు తిన్నాడు. నగరంలోని గోకవరంలో ఉన్న బిఎస్సార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ థామస్ కొంత కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని మానసికంగా వేధిస్తున్నాడు. థామస్ చర్యలు శృతి మించడంతో సహనం చచ్చిపోయిన విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News Posted: 18 February, 2009
|