కడప: జిల్లాలో గురువారం కలుషిత నీరు త్రాగడంతో అరవై మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారు అస్వస్తతకు గురయ్యారు. రాయచోటి మండలం వీరబల్లిలోని కస్తూరిబా ప్రభుత్వ పాఠశాలలో కలుషిత నీరు తాగి అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే రాజచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యానికి గురైనవారిలో ముగ్గిరి మరిస్థితి ఆందోళనగా వుంది. కలుషిత నీరు తాగటం వల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురైయ్యారని వైద్యులు తెలిపారు.