కడప : జిల్లాలో గురువారం ఉదయం రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంతో నలుగురు మరణించారు. సిద్దవటంలోని జె.ఎం.జె. కళాశాల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలో ఒకరు మరణించగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.