రోడ్డు ప్రమాదం: 4గురి మృతి
ఏలూరు : జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలవరం కుడికాలువలో ఒక టిప్పర్ బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. టిప్పర్ ప్రమాదానికి గురైన సమయంలో ఆ దారిన పోయే వారు వెంటనే సహాయ చర్యలు చేయడంతో ప్రమాదం మరింత తీవ్రతరం కాకుండా తప్పింది. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 2 March, 2009
|