తీరనున్న కష్టాలు
రాజమండ్రి : రాజమండ్రి నగరంలో ప్రజలకు కరెంటు కష్టాలు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు నుంచి ఐదు మెగా వాట్ల విద్యుత్ ను ప్రజా అవసరాలకు అందించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిల్లులో 34 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కోల్డ్ బేస్డ్ గ్రిడ్ ఉంది. మిల్లు అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్ లో ఐదు మెగావాట్లను గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు అందించనున్నారు. దీంతో పేపర్ మిల్లు గ్రిడ్ నుంచి విద్యుత్ ను తీసుకుని ఏ మాత్రం కరెంట్ కోత లేకుండా నింతరరాయంగా అందించగలగుతామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 6 March, 2009
|