ఏలూరు : జిల్లాలోని గోపాలపురం మండలం చిట్యాల వద్ద శనివారం ఒక ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో 20మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి పంపించారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.