పేలుడు పదార్థాలు స్వాధీనం
అనంతపురం : జిల్లాలోని వజ్రకరూర్ పరిధిలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 350 బస్తాల పేలుడు పదార్థాలు పోలీసులకు చిక్కాయి. గుంతకల్లు - బళ్లారి రహదారిలో ఉన్న హంద్రీ నీవా క్యాంపులో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడంతో ఈ మందు పదార్థాల గుట్టు రట్టయింది. మొత్తం 350 బస్తాల్లో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్, ఎనిమిది వేల జిలెటిన్ స్టిక్స్, 60 డిటొనేటర్లు పోలీసుల దాడుల్లో దొరికాయి. ఈ పేలుడు పదార్థాలకు ఎలాంటి లైసెన్స్ లేదని పోలీసు అధికారులు మీడియాకు స్పష్టం చేశారు.
News Posted: 16 March, 2009
|