ప్రచారానికి శ్రీకారం
ఏలూరు : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావూరి సాంబశివరావు, నరసాపురం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కృషిని గుర్తించి మరోసారి మద్దతు పలకాలని కనుమూరి బాపిరాజు ఉండి, తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. కావూరి సాంబశివరావు బుట్టాయగూడెం, దొరమ్మిడి, కంగాలవారిగూడెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజుతో కలిసి ప్రచారం చేశారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News Posted: 23 March, 2009
|