తొంబైమూడు లక్షలు సురక్షితం
అనంతపురం : ఎన్నికల నేపధ్యంలో బత్తలపల్లి మండలంలోని మాల్యంవంతం గ్రామంలో ఎస్.ఐ.శ్రీధర్ తనిఖీలు చెపట్టారు. ఇదే సమయంలో ఓ వాహనం పై అనుమానం కలగడంతో ఆ వాహనాన్ని నిలిపి తనిఖీలు చేశారు. ఆవాహనంలో ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు ట్రంకు పెట్టలు ఉండడంతో వాటిని తెరచి చూసి ఒక్క నిమిషం నిశ్చేష్టులయ్యారు. ఒకటీ, రెండూ కాదు ఆ పెట్టెల్లో 93 లక్షల రూపాయలు ఉండడంతో వారిని స్టేషన్ కు తీసుకువచ్చి విచారించణ జరిపారు. ఆ విచారణలో ఆ డబ్బు సిటీ బ్యాంకుకు సంబంధించినదని తెలపడంతో, ఎస్. ఐ. శ్రీధర్ నిజానిజాలను తెలుసుకున్నారు. భద్రతా చర్యలు లేకుండా ప్రొద్దుటూరులోని సిటీ బ్యాంకు నుండి ధర్మవరం బ్రాంచ్ కు ఈ మొత్తాన్ని ఓ అద్దె వాహనంలో తీసుకువస్తున్నారని తెలుసుకుని ఆ డబ్బును సురక్షితంగా బ్యాంకుకు తరలించారు.
News Posted: 27 March, 2009
|