రాజమండ్రి : ప్రముఖ సినీనటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ సభ స్థానానికి ప్రజారాజ్యం అభ్యర్థిగా ప్రకటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు సత్యదేవుని సన్నిధిలో పూజలు జరిపారు. తదుపరి మంత్రాలయంలో బి.ఫారం మీద సంతకం చేసిన రెబల్ స్టార్ 4వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు.