ఘనంగా మహా వీర్ జయంతి
కాకినాడ : జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిమ్మల్ మతీ జైన్ అధ్యక్షతన కాకినాడ రమణయ్య పేటలోని జంతు హింస నివారణా సంస్థ (ఎస్పీసీఏ) పశువుల ఆస్పత్రి ఆవరణలో మహావీర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహావీరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భవర్ లాల్ జైన్, అంబాలాల్ వి.జైన్, ఘెరవ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి నుండి విచ్చేసిన ఘంటాడి జవహర్ లాల్ ను ఘనంగా సత్కరించారు. అలానే తెలుగుదేశం ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికి లేడీస్ క్లబ్ సమీపంలో ఉన్న మహావీరుని విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టిడిపీ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు, జ్యోతుల సీతారామమూర్తి తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News Posted: 8 April, 2009
|