ఓటు వేయవచ్చు...!
అనంతపురం : లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఫోటో గుర్తింపు కార్డు లేకున్నా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ వి.అనిల్ కుమార్ తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ 13 ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను సూచిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలలో దేనినైనా ప్రిసైడింగ్ అధికారికి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల కింద రేషన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాసు పుస్తకాలు, కిసాన్ పుస్తకాలు, పోస్టాఫీస్ పుస్తకాలు, ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రాలు, వృద్ధాప్య ఫించన్లు, వితంత ఫించన్లు, పెన్షన్ బుక్, వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు మొదలగున్నవాటిని ప్రిసైడింగ్ అధికారులకు చూపించి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
News Posted: 11 April, 2009
|