ఉద్యోగులకు కలెక్టర్ హెచ్చరిక
అనంతపురం : ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఎవరైనా పాల్గొంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజక వర్గాల జోనల్ అధికారుల సమావేశం స్థానిక రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ తోపాటు జిల్లా ెస్పీ ఎంకెసింగ్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎ.ఆర్.సంగ్మా, ఎంకె.శ్రీవాత్సవ, బహిరాజ్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
News Posted: 13 April, 2009
|