నిజామాబాద్ : ఖనాపూర్ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా ఖనాపూర్ ఎంపీటీసీ సతీష్ ని హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివార్లలో దుండగలు పడేయడంతో ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమై ఉంటుందని వారు భావిస్తున్నారు.