కడప : కడప జిల్లా మైదుకూరు మండలం కుమ్మరి కొట్టాలలో దారుణం చోటు చేసుకుంది. కాజ్ పేట్ పరిధిలో శ్రీ వెంకటేశ్వర గోడౌన్లో గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేసి ఆపై గొంతుకోసి ముగ్గుర్ని చంపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వాచ్ మెన్ నారాయణ అడ్డుకోవడంతో అతని గొంతుకోసి హతమార్చారు. నాయరాయణ భార్య ఈశ్వరమ్మను గోడౌన్ ప్రక్కకి తీసుకువెళ్ళి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చినట్లు సమాచారం. స్థానికంగా ఈ సంఘటన సంచలనం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.