అనంతపురం : రాష్ట్రంలో అతిసారం ప్రబలి అనేకమంది ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో ప్రజలు మంచినీళ్ళు తాగాలంటేనే భయపడిపోతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కలుషితమైన నీరు తాగడంతో అనేక మంది అస్వస్థతకు గుర్యయ్యారు. హైదరాబాద్ లోని భోలక్ పూర్ సంఘటన మరవకముందే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.