24న టెన్త్ ఫలితాలు
కాకినాడ : పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈనెల 24వ తేదీన విడుదలవుతాయని విద్యాశాఖాధికారి పి.ఆర్.మల్లికార్జునశాస్త్రి తెలిపారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మెమోలు ఇవ్వడానికి, పరీక్ష ఫీజులు కట్టించుకోవడానికి జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయలు, ఉపాద్యాయేతర సిబ్బంది మే 25 నుండి ఫాఠశాలలకు తప్పక హాజరు కావలని ఆదేశించారు. అడ్వాన్స్ డు సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఇన్విజేలేషన్, ఇతర ఉత్తర్వులను ఉపాద్యాయులందరూ పొందాలన్నారు. ఉత్తీర్ణత పొందలేని విద్యార్థులకు జూన్ నెలలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
News Posted: 13 May, 2009
|