ఆస్తి పంపకాల్లో బాలిక మృతి
అనంతపురం : అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదం ముక్కుపచ్చలారని చిన్నారిని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా గుడిబండ మండలం శకరం గల్లుకు చెందిన గోవిందప్ప కూమారులు సంవత్సరం కాలంగా ఆస్తి పంపకాలపై గొడవలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగులో వుంది. ఆస్తిలో తమకు తక్కువ వాటా ఇచ్చారంటూ పెద్దకుమారుడు రామకృష్ణ ఘర్షణకు దిగడంతో తండ్రీ, చిన్న కుమారుడు నారాయణమూర్తి కలిసి అతనిపై కొడవలితో దాడి చేశారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన భార్య సుజాత, కుమార్తె రమ్యలపై కూడా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో చిన్నారి రమ్య మృతి చెందగా, రామకృష్ణ బెంగళూరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
News Posted: 13 May, 2009
|