మనోజ్ఞకు అరుదైన ఆహ్వానం
అనంతపురం : కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం వున్న కళాకారిణి చిన్నారి మనోజ్ఞకు అరుదైన ఆహ్వానం లభించింది. క్రీసెంట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న మనోజ్ఞ కూచిపూడి నృత్య సాంప్రదాయంలో, పళ్ళెంలో నీళ్ళు వుంచి, చుక్క నీరు కిందపడకుండా నృత్యం చేయడం మనోజ్ఞ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే మనోజ్ఞకు అరుదైన అవకాశం లభించేలా చేసింది. ఈ మేరకు ఢిల్లీ కళాభవన్ వారు మనోజ్ఞకు అరుదైన ఆహ్వానం పంపారు. న్యూఢిల్లీలో మే 24న నిర్వహించే `ఆల్ ఇండియా మ్యూజికల్ డాన్స్ ఫెస్టివల్' లో పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. ఈ సదవాకాశం లభించినందుకు తల్లితండ్రులు ధనుంజయనాయుడు, రాధలు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.
News Posted: 18 May, 2009
|