రాజమండ్రి: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారన్న వార్త విన్న ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నల్లా నారాయణ అనే 45 ఏళ్ల చిరంజీవి అభిమాని తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందినవాడు నారాయణ. పురుగుల మందు తాగిన అతనిని చికిత్స నిమిత్తం అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అతను సోమవారం ఉదయం మరణించాడు.