నదిలో పడిన పెళ్ళి బస్సు
అనంతపురం : పెళ్లి బృందంతో బయలు దేరిన ఓ వాహనం అదుపు తప్పి నదిలోకి పడిపోవడంతో ఇద్దరు మరణించగా మరో 15 మంది గల్లంతయ్యారు. అనంతపురం జిల్లా సరిహద్దుల వెంబడి వున్న కర్నాటక రాష్ట్రంలోని మానపల్లి వద్ద హగరి నదిలో అదుపు తప్పి ఓ పెళ్ళివాహనం పడిపోయింది. ఈ ఘటనలో పదిహేను మంది గల్లంతు కాగా, మరో ఇద్దురు మృతి చెందినట్లు తెలుస్తున్నది. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఈతగాళ్ల సహాయంతో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు
News Posted: 20 May, 2009
|