కడప : కడప జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో రైతులు ఎరువుల కోసం ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో రుతుపవనాలు ఇంకా ప్రవేశించక ముందే రైతులు ఎరువుల కోసం ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రైతులు ఎరువుల కోసం దుకాణాలను ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగ మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.