కర్నూలు : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బస్స్ కు బ్రేకులు ఫెయిలై బస్సు షెల్టర్ లోకి బస్సు దూసుకురావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ఓ కుటుంబం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చారు. అర్థరాత్రి శ్రీశైలం చేరుకున్న ఆ కుటుంబం వసతి లేక దగ్గరలోని బస్ షెల్టర్ లో నిద్రించారు. తెల్లవారిజామున కుటుంబసభ్యులు స్నానానికి వెళ్ళగా అందులో ఒక వ్యక్తి అక్కడే నిద్రిస్తున్నాడు. శ్రీ సాయి ట్రావెల్స్ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయి షెల్టర్ లోకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఈ విషయం విన్న కుటుంబసభ్యుల లబోదిబో మంటున్నారు.