నిజామాబాద్ : స్థానిక కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించనున్న `సుజుకీ' క్రికెట్ పోటీలు నగరవాసులకు కనువిందు చేయనున్నాయి. 4వ తేదీన నుండి 7 వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటుండగా వాటికి స్పాన్సర్ చేస్తున్న కంపెనీల పేర్లే ఉండడం విశేషం. పోటీలకు సంబంధించిన వివరాలను స్థానిక నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ లో ప్రోగ్రాం చైర్మన్ ఆనంద్ సోమాని విలేకరుల సమావేసంలో వివరించారు.