ఏలూరు : వేసవిలో సహజంగానే కూరగాయల సాగు తగ్గి ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఆ ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో ఈదురుగాలులతో కూడిన వానలు పడడంతో దాదాపు రెండు వందల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. ఇది కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవడంతో దిగుబడి తగ్గి మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. వర్షాలు కురిసి తోటల నుంచి పంట దిగుబడులు వచ్చేవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందిని వ్యాపారాలు చెబుతున్నారు.