నెల్లూరు : జిల్లాలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. కలువాయి ఎస్ బీఐ బ్రాంచి మేనేజర్ కరుణ ప్రసాద్ నెల్లూరు జిల్లాలోని సప్తగిరి లాడ్జిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.