విద్యార్థులకు ఏటీఎం కార్డ్స్
కాకినాడ : ఉపకారవేతనాలు మంజూరైన ప్రతి విద్యార్థి వద్ద ఏటీఎం లేదా ఈజెడ్ కార్డు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె.శశిధర్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టరేట్ కోర్టు హాలులో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాలర్ షిప్ మంజూరైన ప్రతీ విద్యార్థికీ పాస్ బుక్ తో పాటు ఏటీఎం, ఈజెడ్ కార్టు కల్పించి నేరుగా నగదు పొందే సదుపాయాన్ని కల్పించాలన్నారు. ప్రతీ కళాశాలలో ఇప్పటి వరకు ఎంత మంది ఏటియం కార్డులు పొందారో, మరెంతమందికి కార్డులు కల్పించాలన్న సమాచారాన్ని నాలుగు రోజుల్లో అందజేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి అన్నపూర్ణ, వికలాంగ సంక్షేమ జేడీ జీవన్ బాబు పాల్గొన్నారు.
News Posted: 13 June, 2009
|