వర్షంతో రోడ్లు జలమయం
నెల్లూరు : వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు నెల్లూరులో శుక్రారం రాత్రి కురిసిన వర్షంతో ఊరట చెందారు. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండ సాయంత్రానిల్లా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడంతో ప్రజలు సరదాగా గడిపారు. తదుపరి ఈదురుగాలులు వీచడంతో భారీ వర్షం కురిసింది. దీనికితోడు ఉరుములు, మెరుపులు మెరియడంతో చిన్నారులు భయభ్రాంతులకు గరయ్యారు. ప్రజలందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వేళ్ళే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు రోడ్డేదో, కాలువేదో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఈ వర్షం వల్ల రైతన్నలు సాగునీటి సమస్య తప్పిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బత్తాయి, దానిమ్మ, మామిడి సాగు చేసే రైతులు, వరినాట్లు వేసే రైతుల పొలాలకు నీరు అందడంతో ఈ వర్షం ప్రయోజనం కలిగించిందన్నారు.
News Posted: 13 June, 2009
|