కట్టలు తెంచుకున్న ఆగ్రహం
అనంతపురం : విచక్షణారహితంగా కళాశాలలు ఫీజులు పెంచడంతో ఆ భారాన్ని మోయలేని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే నిబంధనలు మీరి ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతపురంలోని మూడు కార్పొరేట్ కళాశాలలపై విద్యార్థులు, తల్లితండ్రులు ఏకమై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దాడులు చేశారు. పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన విద్యను అందించాల్సిన కళాశాలలు భరించలేని విధంగా ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 22 June, 2009
|