జులై 3న `యువ జయహో'
ఏలూరు : కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిచడంలో కష్టపడిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అభినందన తెలిపేందుకు జులై 3న ఏలూరులో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో `యువ జయహో' కార్యక్రమం నిర్వహించున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాడపల్లి జగన్ చెప్పారు. ధనరెడ్డి రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు టి.జె.ఆర్. సుధాకర్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. యువ జయహో కార్యక్రమంలో విజయాన్ని వరించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిథులను సత్కరించనున్నట్లు చెప్పారు.
సాధించిన విజయంతో సంతృప్తి చెందినవారు ఇంతటితో సరిపెట్టుకోకుండా సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. సిఎం పాదయాత్ర స్ఫూర్తితో ప్రజాసేవే పరమాధిగా యువజన కాంగ్రెస్ ముందుకు సాగాలన్నారు. యువజయహో కర్యక్రమం విజయవంతం కావడానికి మూడు కమిటీలను నియమించామన్నారు. లాజిస్టిక్ కమిటీ చైర్మన్ గా పేరిచర్ల మురళీకృష్ణం రాజు, మొబలైజేషన్ కమిటీ చైర్మన్ గా మున్నా, ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ గా గుడిదేశిన శ్రీనివాసరావులను నియమించిట్లు పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి యువజన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పేరిచర్ల మురళీకృష్ణం రాజు మాట్లాడుతూ సామాజిక సేవా ధృక్పధంతో కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు. షేక్ మున్నా, నక్కెళ్ళ కృష్ణ ప్రసాద్, మేడపాటి రామ్మోహన్ రావు, కారు మంచి రమేష్, ఎల్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 29 June, 2009
|