సింహవాహనంపై సౌమ్యనాథుడు
కడప : నందలూరులో మూడు రోజులు జరుగుతున్న సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారిని సింహవాహనంపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ ధర్మకర్త పి.రామసుబ్బయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొండపల్లి సుబ్బరాయుడు తెలిపారు. సాంస్కృతిక భాగంలో ఈ రోజు రాత్రి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఉంటుందన్నారు. గురువారం రాత్రి సౌమ్యనాథ స్వామివారిని సరస్వతీ అలంకారంలో హంసవానం పై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News Posted: 3 July, 2009
|