నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో శుక్రవారం వివాదం చేటుచోసుకుంది. నిబంధనలకు విరుద్దంగా 20మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ లు ఇచ్చారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. అర్థరాత్రి జరిగిన బదిలీలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీలలో అక్రమాలు జరిగాయంటూ వారు కౌన్సెలింగ్ ను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో కౌన్సెలింగ్ నిలిచిపోయింది.