కడప : జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. కడప హైవేపై ఆర్ టీసీ బస్సును లారీ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.