ఎస్కార్ట్ కానిస్టేబుళ్ళ సస్పెన్షన్
రాజమండ్రి : కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు అనారోగ్యానికి గురి కావడంతో రాజమండ్రి నుంచి కాకినాడ తరలించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఎస్కార్ట్ కానిస్టేబుళ్ళపై సస్పెన్షన్ వేటు పడింది. రాజమండ్రి నుంచి కాకినాడకు చేరుకునే మధ్యలో హైడ్రామా నడిచింది. మార్గమధ్యంలో మూడు గంటలపాటు వాహనాన్ని నిలిపి ఉంచడంతో పాటు, వారిని కాంటాక్ట్ చేసేందుకు అందుబాటులో ఉండకపోవడంతో అధికారులు ఎస్కార్ట్ కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకున్నారు. అత్యాచార యత్నం ఆరోపణల కేసులో ఎమ్మెల్యేలను ఆయన స్వగ్రామంలో సిఐడీ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
News Posted: 23 July, 2009
|