భార్యపై భర్త యాసిడ్ తో దాడి
నెల్లూరు : మహిళలపై యాసిడ్ దాడులకు అంతులేకుండా పోతోంది. హైదరాబాద్ లోని ధ్రువ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటన మరవక ముందే నెల్లూరులో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. విజయ డైరీ సమీపంలో సోమవారం శశికళ అనే వివాహితపై ఆమె రెండో భర్త అజీమ్ యాసిడ్ తో దాడి చేసి పరారయ్యాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. గాయపడిన ఆమెను రామచంద్రారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కొంత కాలంగా వీరి మధ్య సాగుతున్నకుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
News Posted: 27 July, 2009
|