జర్నలిస్టుల మెడిక్లెయిమ్
అనంతపురం : అయిదు సంవత్సరాలుగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆరోగ్య భీమా మెడిక్లెయిమ్ పాలసీ ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరికీ కొనసాగించానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక సంచాలకులు సి.పార్థసారధి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ ఆగస్టు 5వ తేదీలోగా జర్నలిస్టుల ఆరోగ్యభీమా మెడిక్లెయిమ్ చేయించుకోవలన్నారు. ఈ పధకం ప్రీమియం రూ.1,949లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1178లను భరిస్తుందని, జర్నలిస్టులు రూ.771 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల జర్నలిస్టులందరూ నూతన, రెన్యువల్ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి, సంస్థ జారీ చేసిన గుర్తింపుకార్డు, మెడీసేవా హెల్త్ కార్డ్ (జిరాక్స్), అకౌంట్స్ ఆఫీసర్, ఇ అండ్ పిఆర్ డిపార్ట్ మెంట్, హైదరాబాద్ పేరిట తీసిన రూ.771 డిమాండ్ డ్రాప్టును దరఖాస్తుతో పాటు జతచేసి ఆగస్టు 5వ తేదీలోగా ప్రత్యేక కమీషనర్, సమాచారా పౌర సంబంధాల శాఖ (మీడియా రిలేషన్స్), డోర్ నెంబరు 10-2-1, సమాచార భవన్, ఏసిగార్డ్స్, హైదరాబాద్ చిరునామాకు పంపాలన్నారు. ఈ పధకంకు సంబంధించిన ధరఖాస్తు ఫారాలు జిల్లా పౌర సంబంధాల అధికారి, అనంతపురం కార్యాలయంలో లభిస్తాయని ఆయన తెలిపారు.
News Posted: 27 July, 2009
|