గొంతు కోసి పరారైన భర్త
కరీంనగర్ : కడదాకా కాపాడాల్సిన భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై యాసిడ్ దాడులు, గొంతు కోయడాలు, నమ్మించి మోసం చేయడం వంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొలనూరులో జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. వెంటనే ఆమెను అక్కడున్న వారు వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం వారు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
News Posted: 3 August, 2009
|