శెట్టూరులో న్యాయవాది హత్య
అనంతపురం : రెండు రోజుల క్రితం కిడ్నాపైన ఒక న్యాయవాదిని ప్రత్యర్థులు హత్య చేసి, దహనం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రామ్ నగర్ కు చెందిన లాయర్ సురేంద్రగుప్తని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. అటవీ ప్రాంతంలో ఈ రోజులు పోలీసులు దహనం చేసిన మృత దేహాన్ని కనుగొన్నారు. చొక్కాని గుర్తించిన బంధువులు అది లాయర్ దేనని గుర్తించారు. ఈ సంఘటనతో కల్యాణదుర్గం, శెట్టూరు ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మారణ కాండకు భూ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
News Posted: 31 August, 2009
|