భారీగా వైఎస్ సంతాపసభ
కడప : రాజకీయ పార్టీలకతీతంగా కడపలో మంగళవారం లక్షమందితో దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డికి సంతాప సభ జరగనుంది. వైఎస్ సంతాపసభ జరిపేందుకు కడప మేయర్ రవీంద్రనాధరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంతాప సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతారు. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ స్టేడియంలో సంతాపసభ, అంతకు ముందు కడపలో భారీ ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరనున్నట్లు సమాచారం. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు తదితర ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి.
News Posted: 8 September, 2009
|