కరీంనగర్ : బెజ్జంకి ఈవోఆర్డీ చిదంబరం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. కరీనంగర్ జిల్లా బెజ్జంకి ఈవోఆర్డీ చిదంబరం ఎంపిడీవో కార్యాలయంలో సోమవారం రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ పని నిమిత్తం ఆయన లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో వారు వలపన్ని ఈవోని పట్టుకున్నారు.