'మోక్షగుండం' జయంతి
కడప : ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లకు ఆరాధ్యుడైన మోక్షగుండం జయంతిని మంగళవారం సాయంత్రం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కడప లోకల్ సెంటర్ లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మహా మేధావిగా పేరుగాంచిన విశ్వేశ్వరయ్య, శ్రీనివాస శాస్త్రి, వెంకటమ్మ దంపతులకు 1861 సెబ్టెంబర్ 15న జన్మించారు. ప్రకాశం జిల్లా కంభం గిద్దలూరు రోడ్ లో ఉన్న మోక్షగుండం అనే గ్రామంలో విశ్వేశ్వరయ్య సామాన్య కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో మేనమామ రామయ్య చేరదీశారు. బెంగళూరు సెంట్రల్ కళాశాలలో చదువుకునే ఏర్పాటు చేశారు. కాలేజీ ఫీజుల కోసం ట్యూషన్లు చెబుతు వచ్చిన విశ్వేశ్వరయ్య 1881లో పట్ట భద్రులయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షల్లో ముంబయి రాష్ట్రంలోనే సర్వ ప్రథమునిగా ఉత్తీర్ణులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అసిస్టెంట్ ఇంజనీరుగా నియమించింది. ఏడాదిలోపే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పదోన్నతి పొందారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించింది.
News Posted: 15 September, 2009
|