కడప : తెలుగుదేశం కార్యకర్త రామిరెడ్డి శుక్రవారం హత్యకు గురైయ్యారు. కొండాపురం మండలం రావులూరి సమీపంలో తెలుగుదేశం కార్యకర్త రామిరెడ్డిని గుర్తుతెలియని దుండంగులు నరికి చంపారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాత కక్ష్యల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.