ఆటో డ్రైవర్ల సమ్మె
రాజమండ్రి : ప్రేమోన్మాది ఘాతుకానికి నిరసనగా శుక్రవారం ఆటో డ్రైవర్లు రాజమండ్రిలో బంద్ పాటిస్తున్నారు. ప్రేమించానంటూ వెంటబడి వేధించడమే కాకుండా అనూష తల్లిదండ్రుల ప్రాణాలు తీసి, అనూషపై హత్యాయత్నం చేసిన మట్టా రాజేష్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి లలితానగర్ లో ఉంటున్న అనూష ఇంటిపై గురువారం రాత్రి దాడిచేసిన రాజేష్ అనూష గొంతు కోశాడు. అడ్డు వచ్చిన ఆమె తల్లి సత్యవతి, తండ్రి శ్రీనివాస్ ను నరికి చంపేశాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య అనూష ఊగిసలాడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని విద్యార్థి, మహిళా సంఘాలు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించాయి.
News Posted: 18 September, 2009
|