డీఎస్ టెలికాన్ఫరెన్స్ కు చుక్కెదురు
కాకినాడ : కాకినాడలో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీ సభ్యత్వం విషయమై డీఎస్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ కు చుక్కెదురైంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. కార్యకర్తలు డీఎస్ నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్ కార్యాలయానికి తాళాలు వేసి తమ నిరసన తెలియజేశారు.
News Posted: 25 September, 2009
|