అనూషను ఓదార్చిన మురళీమోహన్
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రేమోన్మాది దాడిలో తల్లితండ్రులను కోల్పోయి తీవ్రంగా గాయపడిన అనూష కుటుంబాన్ని ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ పరామర్శించారు. తల్లితండ్రులను కోల్పోయిన అనూష పరామర్శించి, ఆమె చెల్లికి డిగ్రీ వరకు తమ ట్రస్టుకు చెందిన పాఠశాల, కళాశాలలో ఉచిత విద్యను అందిస్తామని అనూష కుటుంబానికి ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి ఉన్మాద చర్యలు పునరావృతం కాకుండా , ప్రేమ్మోన్మాదంతో దాడులు చేస్తున్న వారికి బెయిల్ రాకుండా చట్టంలో మార్పులు వస్తే ఎంతో బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్నితెలిపారు.
News Posted: 29 September, 2009
|