అనుషను పరామర్శించిన సురేఖ
రాజమండ్రి : ప్రేమోన్మాది వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను, ఆమె చెల్లెళ్ళలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసే ప్రేమో న్మాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలను సవరించాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా 25వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సురేఖ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను బాధ్యతాయుతంగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందని అన్నారు. ప్రేమోన్మాదాన్ని నిర్మూలించ డానికి సమాజం కూడా చేయూతనివ్వాలన్నారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై త్వరితగతిన తీర్పులు వెలువడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. కేసులను 15 రోజులకొకసారి సమీక్షించ డానికి సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై నమోదైన కేసులను నాన్బెయిల్బుల్గా సవరించటం జరగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, శాసనమండలి సభ్యులు కొండ మురళీ, జక్కంపూడి విజయలక్ష్మి, భీమవరపు వెంకటేశ్వరరావు, వాసంశెట్టి గంగాధరరావు, ఆర్డీవో చల్లా వినయ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 30 September, 2009
|